ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా సరే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఒకరిపై ఒకరు ఏదోక సందర్భంలో విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా పోలవరం రగడ మొదలయింది. అనవసర సమయంలో అనవసర విషయాన్ని ఎత్తుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. 

 

తాజాగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ తెలుగుదేశం హయాంలో 70 శాతం పూర్తి అయింది అంటే తాను మీసం తీస్తా అని సవాల్ చేసారు. దీనికి స్పందించిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా 2019 జూన్ లో ఏపీ సర్కార్ చెప్పిన 71  శాతం లెక్కను బయటపెట్టగా... ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు మంత్రి మీసం తీయాలి అంటూ సవాల్ చేస్తున్నారు మరి దీనిపై అనీల్ ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: