దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసే యోచనలో ఉంది. నాలుగో విడత లాక్ డౌన్ పై నేడు మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఆరు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు కూడా సడలింపు లు కోరుతున్నాయి. కాని కేంద్రం మాత్రం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

 

ఇప్పటికే లాక్ డౌన్ ఉంటుంది అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసారు. నేటి సాయంత్రం కేంద్ర౦ దీనిపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మహారాష్ట్ర మాత్రం తమకు సడలింపు లు వద్దనే అంటుంది. గుజరాత్ తమిళనాడు దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: