గత రెండు రోజులుగా హైదరాబాద్ వాసులకు చుక్కలు చూపిస్తున్న చిరుత ఆపరేషన్ ముగిసింది. చిరుత అడవిలోకి వెళ్ళింది అని అధికారులు గుర్తించారు. రెండు రోజుల నుంచి దాని కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. దాని ఆచూకి కోసం దాదాపు వంద మందికి పైగా కష్టపడ్డారు. అయినా సరే దాని ఆచూకి మాత్రం దొరకలేదు. 

 

ఇక చిలుకూరు అటవీ ప్రాంతంలోకి అది వెళ్ళింది అని అడుగు జాడల ఆధారంగా గుర్తించారు. ఇక ఇప్పుడు అది చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయింది అని అధికారులు నిర్ధారించి ప్రత్యేక బృందాలను వెనక్కు రప్పించారు. హిమాయత్ సాగర్ వైపు వెళ్ళింది అని మత్స్యకారులు కూడా చెప్పారు. దీనితో ఆపరేషన్ ని ముగించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: