దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోడ్ల మీద వేలాది మంది నడుస్తున్న ఫోటో లు వీడియో లు ఇప్పుడు చాలా మందిని కన్నీరు పెడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళను తరలించడానికి శ్రామిక్ రైళ్ళను ఏర్పాటు చేసినా సరే పెద్దగా ఫలితం ఉండటం లేదు. 

 

విదేశాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేక విమానాలు నేవీ సహకారం తీసుకుని తీసుకొస్తున్నారు. వాళ్ళ వలన మన దేశానికి విమాన టికెట్ మినహా ఓటు కూడా వచ్చే అవకాశం లేదు. వాళ్ళు కనీసం మన దేశానికి చేసేది కూడా ఏమీ ఉండదు. కాని వలస కార్మికులు మన దేశం కోసం కష్టపడుతున్నారు. వాళ్ళను కనీసం గుర్తించకుండా శ్రామిక్ అనే చిన్న పధం తో వాళ్ళను తరలిస్తున్నారు. వందే భారత్ మిషన్ అంటూ మన ఖ్యాతిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: