లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఎన్నో కష్టాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. దాంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకోవొచ్చు అని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారు.. తమ స్వస్థల చేరుకుంటున్నారు. తాజాగా వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. ఒడిశాకు చెందిన కూలీలు కొంతకాలం క్రితం పనికోసం ముస్తాబాద్ వచ్చారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పనిలేకపోవడంతో వారంతా కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. 

 

 

ఎన్నో బాధలు పడుతూ..  నడుస్తూ రెండు రోజుల క్రితం పెద్దూరు చేరుకున్నారు. స్థానిక నాయకులు కొందరు వారికి ఆశ్రయం కల్పించి రెండు రోజులుగా వారికి భోజనాలు అందిస్తున్నారు. అయితే, ఇక్కడి నుంచి వీరు సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు.  నిన్న రాత్రి వారు మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు వారి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఒడిశా తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: