ఆంధ్రా తెలంగాణా సరిహద్దుల్లో కృష్ణా జిల్లా పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తెలంగాణా నుంచి వచ్చే వారిని ఇటు రానీయడం లేదు. అది ఒకటి అయితే అటు నుంచి వచ్చే వారికి యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. ఎమర్జెన్సి పాసులు ఉన్నా సరే రానీయడం లేదు. ఇక ఆరోగ్య౦ బాగా లేని వారిని ఉద్దేశించి ఇప్పుడు పోలీసులు వేస్తున్న ప్రశ్నలు ఇబ్బంది గా మారాయి. 

 

బాగానే ఉన్నాయి అంటూ మాట్లాడుతున్నారు. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు నుంచి తెలంగాణా వెళ్ళే వారిని అక్కడి పోలీసులు అడ్డుకోవడం లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇది మంచి విధానం కాదని మరి అనుమతి ఇవ్వనప్పుడు పాస్ లు ఎందుకు అని ప్రశ్నలు వినపడుతున్నాయి. వాహనాలు సరిహద్దుల్లో బారులు తీరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: