ఆంధ్రప్రదేశ్ లో వలస కూలీల కష్టాలపై నిన్న సాయంత్రం స్పందించి వారికి పునరావాసం ఏర్పాటు చెయ్యాలని ఆమె ఆదేశించారు. వారి తో మాట్లాడి వారిని సొంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చెయ్యాలని ఆమె అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె ఇచ్చిన ఆదేశాలతో వెంటనే స్పందించిన అధికారులు దాదాపు 200 మందిని పునారావాస కేంద్రాలకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

 

దీనిపై స్పందించిన విజయవాడ ఎంపీ కేసినేని నానీ సిఎస్ పై విమర్శలు చేసారు. గత నెల రోజులుగా వలస కార్మికులు  రోడ్లు మీద నడుస్తూ ఆకలితో అలమటిస్తున్న విషయం అన్ని  టీవీల్లో పేపర్లల్లోచూస్తూనే ఉన్నాం ఇప్పుడు వరకు నిద్ర పోయి ఇప్పుడే లేచినట్లు వున్నారు CS గారు అంటూ నానీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: