టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత దోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీనితో అతని కెరీర్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

అతను క్రికెట్ నుంచి తప్పుకుంటాడు అనుకున్న తరుణంలో ఐపిఎల్ కోసం కష్టపడ్డాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా చేసాడు ధోనీ. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది టోర్నీ ని పూర్తిగా రద్దు చేసారు. వచ్చే ఏడాది కూడా టోర్నీ పై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనితో ఇప్పుడు ధోనీ తప్పుకోవడమే మంచిది అనే భావన లో ఉన్నాడు అని తెలుస్తుంది. ఐపిఎల్ కోసమే అతను వేచి ఉన్నాడు అని ఇప్పుడు లేకపోవడం తో ఇక తప్పుకోవడానికి రెడీ అయ్యారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: