IHG

కలియుగ పాండవులు సినిమాతో తన గ్లామర్ సత్తా చాటిన నటి కుష్బూ. ఆమె నటన ప్రారంభించిన తొలినాళ్ళనుండి యువతను ఆకట్టుకుంది. ఈమె కోసం తమిళనాడు ప్రజలు గుడి కట్టించారంటే అర్థమౌతుంది ఈమెకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందొ...లాక్ డౌన్ సందర్భంగా ఈ అందాల నటి ఇంట్లోనే ఉంటోంది. అయితే తాజాగా కుష్బూ మాములుగా రెడీ అయ్యి తన భర్తకు ఆలా కనిపించింది అంతే తన భర్త సుందర్ సీ తన కెమెరా తో తన భార్య అందాలను వడిసి పట్టుకున్నాడు.

 

 

ఈ విషయాలను కుష్బూ తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసింది. ఆ సందర్భాన్ని కుష్బూ వివరిస్తూ ...నేను రెడీ అవ్వడానికి ఎటువంటి అకేషన్ కారణం కాదు ...ఎప్పుడైతే నా భర్త ఫోటో గ్రాఫర్ అవతారం ఎత్తాడో ...ఈ సీన్ కాస్త అకేషన్ గా మారిందని చెబుతోంది. నేను ఇలా అందంగా కనబడుతున్నాను ఆంటే ఆ క్రెడిట్ అంత నా భర్త దే అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కుష్బూ , సుందర్ సీ లకు ఇద్దరు కుమార్తెలు  అవంతిక, ఆనందితా.  కుష్బూ చిరంజీవికి అక్కగా స్టాలిన్ లో నటించింది. ఆతరువాత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి సినిమాలో తన నటనతో మెప్పించింది.  ప్రస్తుతం కుష్బూ 'ఓహ్ అంధ నాట్కళ్ ' , 'అన్నఅత్థే' సినిమాలతో బిజీ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: