లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక బస్సులను నడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసి సిద్దమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే బస్సులను పూర్తి స్థాయిలో సిద్దం చేసింది ఆర్టీసి. ప్రభుత్వం అనుమతి ఇస్తే వెంటనే హైదరాబాద్ లో ఉన్న వారిని తీసుకుని రావడానికి ఆర్టీసి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించింది. 

 

త్వరలోనే వీరిని తరలించే అవకాశం ఉంది. వాస్తవానికి నేటి నుంచి బస్సులను నడపాల్సి ఉన్నా అది సాధ్యం కాలేదు. సాంకేతిక సమస్య సహా కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో బస్సులను నడపడానికి గానూ సిద్దమైనట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ప్రకటన తో పాటుగా టికెట్ లను కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: