కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాల మీద మీడియా ఆసక్తి తగ్గిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించి వివరాలను నిర్మలా సీతారామన్ చెప్తారు అనగానే ఆమె కేటాయింపులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. 

 

మొదటి రెండు రోజులు ఆమె ప్రసంగాల మీద ప్రత్యేకంగా ఆసక్తి చూపించిన మీడియా ఆ తర్వాత మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. నేడు ఆమె ప్రసంగం వస్తూ ఉన్న సమయంలోనే మీడియా ప్రకటనలు కూడా ఇచ్చింది. మొదటి రోజు రెండో రోజు అయితే ప్రసంగం అయ్యే వరకు పక్కన ఏ ప్రకటనలు లేకుండా ప్రసారం చేసిన చేసిన మీడియా ఈ రోజు మాత్రం అంత ఆసక్తి చూపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: