ఇప్పుడు లాక్ డౌన్ లో జనాలకు వినోదం అనేది దాదాపుగా ఆగిపోయింది. ఒక్క సినిమా కూడా ఇప్పుడు దేశంలో విడుదల అయ్యే పరిస్థితి లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. దీనితో ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా జనాలకు వినోదం అందించే కార్యక్రమాలు చేస్తున్నారు సినీ ప్రముఖులు.
తాజాగా బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి నిర్మాతగా వ్యవహరించిన ‘పాతాల్ లోక్’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదల కాగా... దీనిపై విరాట్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసాడు. ‘పాతాల్ లోక్’ ఒక మాస్టర్ పీస్ అని పేర్కొన్నాడు. పాతాల్లోక్ వెబ్ సిరీస్ని చూశాను. స్క్రీన్ప్లే, కథ విషయంలో ఇది ఒక మాస్టర్ పీస్ అని అభినందించాడు. అంతేకాక.. అందరూ అద్భుతంగా నటించారని కీర్తించాడు. ప్రజలు కూడా ఈ సిరీస్ను ఇంతలా ఎందుకు ఆదరించారో నాకు అర్ధమైందని పేర్కొన్నాడు. ఇలాంటి అద్భుతమైన వెబ్సిరీస్లను నిర్మిస్తున్న నా ప్రేమ అనుష్క శర్మని చూసి చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు.