ఇప్పుడు దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు క్రమంగా మొదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు లో కూడా మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం కరోనా వైరస్ ని దృష్టి లో ఉంచుకుని నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో మద్యం షాపులు నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షాపులు తెరవడానికి గానూ కొన్ని మార్గదర్శకాలను సిద్దం చేసింది.
భౌతిక దూరం పాటిస్తూనే టోకన్ సిస్టమ్ అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో... మద్యం దుకాణాల ముందు హెల్మెట్ లు గొడుగులు పెట్టుకుని జనం సిద్దమయ్యారు. రోజుకు ఒక్కో షాపు కేవలం 500 టోకెన్లు జారీ చేసి వాటికి మాత్రమే మద్యం అమ్మేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది