ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో రైల్వే ఉద్యోగిని పై ఏపీఎస్సీ 14వ‌  బెటాలియన్  కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హుస్సేన్‌ వలి లాక్ డౌన్‌లో భాగంగా హిందూపురం పట్టణంలో విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే వాహనాల తనిఖీల్లో భాగంగా రైల్వే గేట్ కీపర్‌గా ఉద్యోగం చేస్తున్న మహిళతో హుస్సేన్ వలి పరిచయం ఏర్పర్చుకున్నాడు.

 

ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని రైల్వే ఉద్యోగిని ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కానిస్టేబుల్ హుస్సేన్ వలిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: