హైదరాబాద్ లో చికెన్ మటన్ కోసం భారీగా జనాలు బారులు తీరుతున్న నేపధ్యంలో అక్కడ చికెన్ మటన్ షాపు యజమానులు భారీగా ధరలను పెంచేస్తున్నారు. హైదరాబాద్ లో కిలో చికెన్ 300 దాటింది. మటన్ అయితే కొన్ని ప్రాంతాల్లో వెయ్యి వరకు అమ్మే పరిస్థితి ఉందని సమాచారం. దీనిపై ఇప్పుడు సీరియస్ గా ఉన్నారు అధికారులు.

 

మాంసం తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 700 దాటి కిలో మటన్ అమ్మ వద్దు అని చెప్తున్నా సరే మారడం లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నగర వాసులు. ఇప్పటికే లాక్ డౌన్ తో ఆర్ధికంగా యిబ్బంది పడుతున్న వేళ ఈ స్థాయిలో పెంచడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: