ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. గత 24 గంటల్లో కేవలం 25 కేసులు నమోదు కాగా ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2230 గా ఉంది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో ఎక్కువగా కోయంబేడు లింక్ లే ఉన్నాయి. 

 

గత 24 గంటల్లో 14 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు రోజులుగా కరోనా కేసులు 40 పైగా నమోదు అయ్యాయి. ఇక ప్రకాశం జిల్లాలో జీరో కి వెళ్ళిన కరోనా కేసులు మళ్ళీ నమోదు అయ్యాయి.  కొత్తగా 3 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: