ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా వరద జలాలకు సంబంధించిన తీసుకొచ్చిన జీవో నెంబర్ 205 ని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సమర్ధించారు. రాయలసీమ కోసం ఎవరు పోరాటం చేసినా సరే మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. పట్టిసీమ అనేది లేకపోతే రాయలసీమకు నీళ్ళు వచ్చేవా అని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ లేదని అప్పట్లో వైసీపీ ఎద్దేవా చేసింది అని ఆయన ఆరోపించారు. 

 

కేసీఆర్ పోతిరెడ్డి పాడు విస్తరణకు అనుకూల౦ కాదని ఆయన మండిపడ్డారు. కాగా పోతిరెడ్డి పాడు వ్యవహారంలో ఇప్పటి వరకు తెలుగుదేశం నేతలు చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అవసరం అయితే మినహా మాట్లాడవద్దు అని రాయలసీమ నేతలు అయినా సరే చూసి కామెంట్స్ చెయ్యాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: