సాధారణంగా పెళ్లి ఖర్చు అంటే ఈ రోజుల్లో కనీసం 10 లక్షల వరకు అవుతూ ఉంటుంది. పెళ్లి చెయ్యాలి అంటే చాలు ఇప్పుడు నానా హడావుడి పడతారు. కాని లాక్ డౌన్ పుణ్యమా అని ఒక పెళ్లి 12 వేల ఖర్చు తో అయిపోయింది. చాలా సింపిల్ గా ఈ వివాహం చేసారు. ఎక్కడ అంటే హైదరాబాద్ లోని చందా నగర్ లో. చందానగర్లో ఎస్మాక్స్ హెచ్ఆర్ ఉద్యోగి తొట్టెంపూడి నరేంద్రబాబు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని వాసిరెడ్డి మౌనిక వివాహం చేసుకున్నారు.
వీరిద్దరికీ ముందే బంధుత్వం ఉంది. అయితే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండటం తో మార్చ్ లో పెళ్లి చేసుకుందాం అని భావించారు. కాని అప్పుడు లాక్ డౌన్ విధించడం తో పెళ్లి వాయిదా అపడింది. ఇప్పుడు ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని చాలా తక్కువ ఖర్చు తో వివాహం చేసుకున్నారు.