ఈ లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా క్రికెటర్లు తాము ఇంట్లో ఎం చేసేది అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియో లను ఎక్కువగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట కోహ్లీ యువరాజ్ సింగ్ వంటి వారు ఇప్పుడు అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇలాంటి వీడియో నే ఒకటి పోస్ట్ చేసాడు. కృష్ణావతారం ఎత్తాడు ధావన్. ఫ్లూట్ ఊదుతున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. గతంలో కూడా ధావన్ పలుమార్లు ఫ్లూట్ వాయించిన వీడియో లు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అతను గాయం కారణంగా జట్టుకి దూరంగా ఆన్నాడు.