ఏపీలో కరోనా కట్టడి కావడం తెలంగాణా లో కరోనా కేసులు పెరగడం పై ఇప్పుడు ఏపీ సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. తెలంగాణాలో ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తెలంగాణా ఏపీ సరిహద్దుల్లో ఏపీ పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని కూడా సరిహద్దులు దాటి రానీయడం లేదు. అనవసరంగా ఎవరు వచ్చినా సరే వెనక్కు పంపిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వారు అందరిని కూడా క్వారంటైన్ లో ఉండాలని, 

 

తెలంగాణా ప్రభుత్వం అనవసరమైన పాస్ లు కూడా ఇస్తుంది అని అత్యవసర పాస్ లు అయితేనే ఇవ్వాలి అని సూచనలు చేస్తున్నారు. ఇక కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల సరిహద్దుల వద్ద పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: