ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఒక సైనికుడు తన భార్యా పిల్లలను చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లో వీకే యాదవ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ అలహాబాద్ సీఆర్పీఎఫ్ క్యాంపులో నివాసం ఉంటూ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో ఎం జరిగింది అనేది తెలియదు గాని... 

 

భార్యను కూతురు ని కాల్చి చంపాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి ఏంటీ అనేది తెలుసుకున్నారు. చంపి తలుపు వేసుకుని ఇంట్లోనే ఉండిపోయాడు అని అతను ఎందుకు హత్య చేసాడు అనేది తెలియలేదు అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: