ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇప్పుడు వలస కూలీల విషయంలో రాష్ట్ర అధికారులు చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోకి వలస కూలీలు అడుగు పెట్టిన వెంటనే వారిని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాల్లో సొంత ఊర్లకు తరలిస్తుంది. జాతీయ రహదారుల వెంట వెళ్ళే వలస కార్మికులను పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి సొంత ఊర్లకు తరలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను సొంత ఊర్లకు తరలిస్తున్నారు. ఇక వారికి ఆహారం ఏర్పాటు చేయడమే కాకుండా వారికి పునారవాసం ఏర్పాటు చేసి... పంపిస్తున్నారు. గుంటూరు జిల్లా అధికారులు ఏకంగా 4 వేల మంది వలస కార్మికులను సొంత ఊర్లకు తరలించారు. వాళ్ళను చూసి ఇప్పుడు దేశం కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడింది.