దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పై నేడు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాలుగో విడత లాక్ డౌన్ ని కొన్ని మినహాయింపు లతో దేశ వ్యాప్తంగా కొనసాగించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇక 30 మున్సిపాలిటీల్లో మాత్రం కరోనా తీవ్రత చాల ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది.

 

కేంద్ర బృందాలు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించాయి. ఇప్పుడు ఇక్కడ కఠిన నిర్ణయాలు అమలు చెయ్యాలి అని భావిస్తున్నాయి రాష్ట్రాలు కూడా. ఇప్పుడు కొత్తగా ప్రకటించే లాక్ డౌన్ లో ఇక్కడ ఆంక్షలను మరింత కఠినం గా అమలు చేసే దిశగా మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణా ఏపీ మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది అని కేంద్రం గుర్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: