హైదరాబాద్ లో బ్యాంకు లను పూర్తిగా మూసేసే ఆలోచనలో తెలంగాణా ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై మంత్రి వర్గం ఉపసంఘం తో చర్చలు జరిపి అప్పుడు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక బ్యాంకు లో ఒక మహిళ కారణంగా కరోనా సోకింది. కంటైన్మేంట్ జోన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా సోకింది. 

 

ఆమె నుంచి సిబ్బందికి రావడంతో ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. దీని తో బ్యాంకు లను పూర్తిగా మూసి వెయ్యాలని లేదా బ్యాంకు లలో క్యాష్ ని ఇవ్వకుండా ఓన్లీ ఆన్లైన్ ద్వారానే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో సర్కార్ నుంచి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: