ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. తాజాగా అనీల్ కుమార్... ఉమాపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. బుర్ర తక్కువ నెల తక్కువ అనడం బూతులు కాదని పేర్కొన్నారు. 

 

గతంలో సిఎం వైఎస్ జగన్ ని వైసీపీ నేతలను ఏ విధంగా మాట్లాడావో గుర్తు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. పోతిరెడ్డిపాడు విషయంలో మీ వైఖరి ఏంటో చెప్పాలని అనీల్ ఉమాను నిలదీశారు. కమీషన్ ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం ఏర్పాటు చేయలేదని అనీల్ ఉమాను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: