కుక్క తోక వంకరే అన్నట్టు ఉంది డ్రాగన్ దేశం చైనా బుద్ధి. ఒక పక్క జనాలు కరోన తో ఇబ్బందులు పడుతున్నా ఆ దేశం వైఖరి మాత్రం మారడం లేదు. భారత్ సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంది. ప్రతీ రోజు ఎదోకరకంగా భారత్ లో చైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూనే ఉంది. 

 

తాజాగా ఆ దేశానికి చెందిన హెలికాప్టర్ లు మన దేశంలోకి వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని లహుల్-స్పిటి జిల్లా ఎస్పీ రాజేష్ ధర్మాని వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే... ఏప్రిల్ 11, 20 తేదీల్లో చైనా హైలికాప్టర్లు ఆ జిల్లాలోకి అడుగుపెట్టాయని చెప్పారు. ఏప్రిల్ 11న జిల్లాలోని సాంథో ప్రాంతంలోకి 12 నుంచి 15 కిలోమీటర్ల మేర చైనా హెలికాప్టర్ ఒకటి వచ్చిందని, 20 వ తేదీన కూడా అలాగే వచ్చింది అని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: