భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులకు మన సైన్యం చుక్కలు చూపిస్తుంది. ఉగ్రవాదులను నిఘా వర్గాల సహకార౦ తో మన దేశ సైనికులు మట్టు బెడుతున్నారు. తాజాగా ఒక కీలక ఉగ్రవాదిని భారత ఆర్మీ కాల్చి చంపింది. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తాహిర్ అహ్మద్ భట్ అనే ఉగ్రవాదిని మన సైన్యం కాల్చి చంపేసింది. 

 

జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా ఖోత్రా గ్రామంలో  సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ ని నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో తాహిర్ ని కాల్చి చంపారు. అతని కోసం దాదాపుగా నాలుగు నెలల నుంచి భారత ఆర్మీ వేట కొనసాగిస్తుంది. అక్కడ జరిగే కార్యాకలాపాలు అన్నీ అతని కిందే జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: