లాక్ డౌన్ కొనసాగించిన నేపధ్యం లో కేంద్ర క్యాబినెట్ మరోసారి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహి౦చనుంది. కాన్ఫెరెన్స్ రాత్రి 9 గంటలకు జరగనుంది. అన్ని రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీ లతో మరియు ప్రిన్సిపల్ సెక్రటరీలు ,హోమ్ సెక్రటరీలు అదే విధంగా ఆరోగ్య శాఖ కార్య దర్శలతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తారు.

 

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో ముఖ్య౦గా ముందు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం చర్చిస్తారు అని సమాచారం. ఇక సడలింపుల విషయాలో కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. లాక్ డౌన్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: