లాక్ డౌన్ ఉన్నా ఎంత కఠినం గా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా సరే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. ఎన్ని కఠిన ఆంక్షలు ఉన్నా సరే ఇప్పట్లో ఇది కట్టడి అయ్యే అవకాశం మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. దేశంలో మొన్న 4987 కేసులు నమోదు అయితే... నిన్న 5050 కేసులు నమోదు అయ్యాయి. 

 

రెండు రోజుల్లో పది వేలకు పైగా కేసులు వచ్చాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 154 మంది కరోనా కారణంగా మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్ లో కరోనా విలయతాండవం చేస్తుంది. అసలు ఈ కేసులు ఎక్కడ నమోదు అవుతున్నాయి ఏ విధంగా నమోదు అవుతున్నాయి అనేది ఎవరూ చెప్పడం లేదు. దీనితో జనాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: