తెలంగాణాలో సాయంత్రం కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణా సిఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. లాక్‌డౌన్‌ పొడిగింపు, సడలింపులు, ప్రజారవాణాపై నిర్ణయాలు తీసుకునేందుకు కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం అవుతారు ప్రగతి భవన్ లో. 

 

ఈ సమావేశం లో ఆర్టీసి పై కేసీఆర్ నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఆర్టీసి బస్సుల విషయంలో కేంద్రం సూచనల ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఇప్పటికే ఒక ప్రకటన చేసారు. ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులను నడిపే అంశంపై కేసీఆర్ చర్చిస్తారు. గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ లో ఇప్పుడు బస్సులను నడిపే అంశంపై కూడా మంత్రులు ఇతర అధికారులతో ఆయన చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: