దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. దేశంలో కరోనా కేసులు 96 వేలు దాటాయి. ఇప్పటి వరకు కరోనా కారణంగా 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతే రెండు రోజుల్లో పది వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 

 

నిన్న ఒక్క రోజే 5 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే... రేపటి తో లక్ష కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. నాలుగు వేలకు పైగా కరోనా కేసులు రేపు కూడా నమోదు అయితే లక్ష కేసులు దాటేస్తాయి. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: