హైదరాబాద్ లో పోలీసులు ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో చాలా వరకు సీరియస్ గానే ఉంటున్నారు. ఎవరిని కూడా క్షమించే పరిస్థితి అనేది లేదు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను ఏ మాత్రం జాలి దయా లేకుండా సీజ్ చేసేస్తున్నారు. ఎవరు చెప్పినా సరే వినే పరిస్థితి లేదు. 

 

ఇక భారీ వేలాది వాహనాలను సీజ్ చేసారు పోలీసులు. సరైన కారణం లేకుండా బయటకు వచ్చిన వారిని ఉపేక్షించడం లేదు. లాక్‌డౌన్‌లో భారీగా ట్రాఫిక్‌ చలాన్లను ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించినవారి నుంచి రూ. కోటి 25 లక్షల చలాన్లు వసూలు చేసిన పోలీసులు... బైక్‌పై రెండో వ్యక్తి ప్రయాణించిన వారి నుంచి రూ.3.5 కోట్ల చలాన్లు వసూలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: