లాక్ డౌన్ లో జనాలు అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జనాలు అందరూ కూడా సోషల్ మీడియాలో తమలో ఉన్న ఒక ప్రత్యేక కళ ని బయటపెడుతున్నారు. తాజాగా ఒక ఛాలెంజ్ బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... ఇద్దరు వ్యక్తులు ఉంటారు. 

 

ఒక వ్యక్తి వెనుక మరొకరు నిలబడి ఉంటారు. వెనుక నిలబడిన వ్యక్తి... ముందు నిలబడిన వ్యక్తి వీపుపై ఒక పేపర్ పెట్టి ఒక బొమ్మ గీస్తాడు. అతను ఏం గీస్తున్నాడు అనేది గ్రహించి ముందు వ్యక్తి అదే బొమ్మను గీయాలి. ఇందులో కొందరు విజయవంతం అయితే మరికొందరు ఫెయిల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని డూడుల్ ఛాలెంజ్ అని పిలుస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: