ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మడ అడవులను నరికే వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. కాకినాడ తీరంలో ఉన్న మడ అడవులను నరకడం పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తీర ప్రాంతాలను మడ అడువులు రక్షిస్తాయని అలాంటి వాటిని నరకడం ఏంటీ అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై హైకోర్ట్ లో పిటీషన్ కూడా దాఖలు అయింది. 

 

దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్ట్ స్టేటస్ కో ఇచ్చింది. మడ అడవులు నరకడం పర్యావరణం కి ప్రమాదం అని పిటీషనర్ వాదించారు. దీనిపై హైకోర్ట్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు పిటీషనర్. హైకోర్ట్ దీనిపై స్టేటస్ కో ఇస్తూ నాలుగు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: