ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టవద్దు అని ముందు మాట్లాడిన జగన్ ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కి వెళ్లి కొబ్బరికాయ కొట్టారు అని చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం విషయంలో రెండు రాష్ట్రాలు పాకిస్తాన్ ఇండియా అవుతాయా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

 

ఇప్పుడు జగన్ డ్రామాలు ఆడుతున్నారు అని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. పార్టీ నేతలు ఎవరూ కూడా తొందరపడి కాళేశ్వరం మీద విమర్శలు చేయవద్దు అని చంద్రబాబు సూచనలు చేసారు. రెండు రాష్ట్రాలు ఇక్కడ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: