నెల్లూరు జిల్లాలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సందర్భంగా ఒక చిన్నారి తో వెట్టి చాకిరి పోలీసులు దగ్గర ఉండి చేయించడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో లు ప్రధాన మీడియా తో పాటుగా సోషల్ మీడియా లో కూడా వైరల్ అవుతున్నాయి. 

 

దీనిపై ఏపీ డీజీపీ స్పందించారు. ఈ ఘటన తనను చాలా బాధించింది అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకూడదు అని అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్ కూడా దీనిపై మౌనంగా ఉన్నాడని ఆయన మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే వారి కూతురు అయితే కానిస్టేబుల్ ఇలాగే చేస్తారా అని ఆయన నిలదీశారు. విచారణ జరిపి కాలేజి యాజమాన్యం పై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: