ఏపీలో ప్రస్తుతం డిపో నుంచి డిపో కు మాత్రమే బస్సులు నడుస్తాయని ఏపీ రవాణా శాఖా మంత్రి పెర్ని నానీ పేర్కొన్నారు. సిఎం జగన్ ఆర్టీసి బస్సులకు అనుమతి ఇచ్చిన నేపధ్యంలో మంత్రి మీడియా తో మాట్లాడుతూ మాస్క్ భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసారు. మాస్క్ లేకపోతే బస్సుల్లోకి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేసారు. 

 

20 మంది మాత్రమే బస్సులోకి అనుమతి ఇస్తామని ఆయన స్పష్టం చేసారు. పరిమిత సంఖ్యలో మాత్రమే బస్సులకు అనుమతి ఇస్తామని ప్రజలు ఎవరూ కూడా కంగారు పడి బస్టాండ్ కి రావొద్దని ఆయన సూచనలు చేసారు. పరిస్థితి ఆధారంగా చేసుకుని తర్వాత బస్సులను మరిన్ని  నడిపే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: