తెలంగాణా కేబినేట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజి సహా పలు విషయాలు కరోనా నియంత్రణ, ఆర్టీసి బస్సులకు అనుమతి, కృష్ణా నదీ జలాల వివాదం సహా పలు అంశాలపై ఈ కేబినేట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అదే విధంగా నియంత్రిత పంటల విషయంలో కూడా కేబినేట్ లో చర్చిస్తున్నారు.

 

ఆర్టీసి బస్సులకు తెలంగాణా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆర్టీసి బస్సుల్లో భారీగా సీట్లు తగ్గించి ఏ బస్సు అయినా సరే 20 మందిని మాత్రమే అనుమతించాలి అని కేసీఆర్  నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బస్సు చార్జీలను కూడా పెంచే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. మంత్రులు కూడా చార్జీల పెంపు ని సమర్ధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: