ఈ కరోనా ఏమో గాని ఇప్పుడు ప్రభుత్వాలు నిబంధనల విషయంలో నానా రకాల ఇబ్బందులు పడుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్గదర్శకాలను తయారు చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా కేరళ ప్రభుత్వం బార్బర్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్ని సూచనలను కూడా చేసింది. 

 

బార్బర్ షాపుల్లో హెయిర్ కట్ ఒక్కటే చెయ్యాలి. షేవింగ్ గాని, ఫేషియల్ గాని చేస్తే ఫిర్యాదు వచ్చిన వెంటనే నిజా నిజాలు పరిశీలించి సీజ్ చేసేస్తాం అని పేర్కొంది. బ్యూటీపార్లర్లు తెరిచేందుకు అనుమతి లేదని, బార్బర్ షాపుల్లో ఏసీలను వాడకూడదని స్పష్టం చేసింది. ఇక షేవింగ్ కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: