రేపటి నుంచి రాష్ట్రంలో ఈ కామర్స్ సర్వీసులకు అనుమతి ఇస్తున్నామని తెలంగాణా సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా ఫంక్షన్ లు చేసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ యధాతధంగా ఉంటుంది అని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఆటోలో ఇద్దరు ట్యాక్సీ లో ముగ్గురుకి మాత్రమే అనుమతి ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

 

స్విగ్గి జోమాటో, అమెజాన్ సంస్థలకు ఈ నిర్ణయం తో ఊరట లభించింది. మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. పబ్ బార్లు యధాతధంగా మూసి వేసి ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో సిటీ బస్సులకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు రావొద్దని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: