తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలొని సినీ లవర్స్ కు మరోసారి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో థియేటర్లను ఓపెన్ చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే పంటలు వేయాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణలో పత్తి పంటకు భవిష్యత్ ఉందని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో సడలింపులను కేసీఆర్ అమలు చేశారు. 
 
ఇష్టం వచ్చిన పంట వేస్తే రైతు బందు కట్ చేస్తామని సీఎం హెఛ్చరించారు. రైతుల తలరాతే రైతులే రాసుకోవాలని... రైతులకు పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని... ప్రభుత్వ సూచనలు పాటించి లాభాలు పొందాలని తాను కోరుతున్నానని కేసీఆర్ అన్నారు. వరి పంటలో తెలంగాణ సోనా రకం పండించాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: