గత వారం రోజులుగా హైదరాబాద్ వాసులకు అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుత ఆచూకి దొరికింది. గత వారం కాటేదాన్ లోని అండర్ బ్రిడ్జి వద్ద కనపడిన చిరుత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో అర్ధం కాలేదు. దాని కోసం ఎన్ని విధాలుగా గాలింపు చర్యలు చేపట్టినా సరే అది మాత్రం దొరకలేదు. 

 

తాజాగా హిమాయత్ సాగర్ వద్ద ఉన్న జీవీకే గార్డెన్ లో నీళ్ళు తాగుతూ ఉండగా అక్కడ ఉన్న వాచ్ మెన్ దాన్ని చూసాడు.. అధికారులకు సమాచారం ఇవ్వడంతో గార్డెన్ లో కుక్కలను బోనులను ఏర్పాటు చేసారు. ఇక ఆ ప్రాంతంలో ఇప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు. అది నీళ్ళు తాగడానికి వచ్చిందని అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: