దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఇక జంతువులు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. సింహాలకు పులులకు కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని హెచ్చరికలు రావడం కొన్ని ప్రాంతాల్లో జంతువులు కూడా అనుమానాస్పదంగా మరణించిన నేపధ్యంలో ఇప్పుడు పశువుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో కొన్ని గ్రామాల్లో రైతులు తమ ఎద్దులకు కూడా మాస్క్ లు పెడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు తమ ఎద్దులకు మాస్క్ లను పెట్టి ఎడ్ల బండ్లు కట్టడం ఆశ్చర్యంగా మారింది. ఈ వీడియో లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. పలువురు వీటిని చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో రైతులు ఇలా మాస్క్ లు ఏర్పాటు చేసారు.
Fearing #Corona infection, villagers attach mask on nostril of bullocks to transport potable water in the scorching heat at Sehore, MP. #IndiaFightsCorona @News18India @CNNnews18 pic.twitter.com/HRgu7aXCjb
— Manoj Sharma (@ManojSharmaBpl) May 19, 2020