టాలీవుడ్ లో ఇప్పుడు ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడంపై పెద్ద చర్చే జరుగుతుంది. సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడం పై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అందుకు మద్దతు ఇస్తుంటే మరి కొందరు మాత్ర౦ అందులో సినిమా విడుదల చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తాజాగా హీరో రామ్ దీనిపై తనదైన శైలి లో స్పందించాడు. మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఏమిటంటే, ఇది కొద్దిమందికి ఒక అభిరుచి.. చాలా మందికి వ్యాపారం, & మిగిలిన వారికి ఒక జూదం, ప్రతి ఒక్కరూ తమ సొంత కోణం నుండి చూస్తారని పేర్కొన్నాడు. ఇంతకు తాను సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి మద్దతు ఇస్తున్నాడో లేదో చెప్పలేదు. అతని రెడ్ సినిమా ఓటీటీ లో విడుదల చేస్తారని అంటున్నారు.
The thing about the movie industry is..
— ram pothineni (@ramsayz) May 18, 2020
It’s a Passion for a few..
a business for most..
& a Gamble for the rest..
Everyone sees it from their own perspective..#OTT #Theatrical #RAndoMthoughts