మీకు చేతకాదు, మేము సలహాలు ఇస్తే వెక్కిరిస్తారు అంటూ తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు. అసలు సూర్యాపేట ను ఏ విధంగా గ్రీన్ జోన్ గా ప్రకటించారని ఆయన నిలదీశారు. రాజకీయంలో రంగులు నడుస్తాయి గాని కరోనాలో రంగులు నడిచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసారు. 

 

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు అంటూ మండిపడ్డారు. టెస్ట్ ల విషయంలో హైకోర్ట్  ఎన్ని మొట్టికాయలు వేసినా సరే ప్రభుత్వంలో మాత్రం మార్పు రావాడ౦ లేదని ఉత్తమ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు టెస్ట్ లు చేయకుండా సూర్యాపేట ను గ్రీన్ జోన్ అని ఏ విధంగా ప్రకటించారు అని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: