దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కనీసం 5 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ విషయంలో కొన్ని ఉపశమన విషయాలు ఇప్పుడు ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటీ అంటే... దేశంలో రికవరీ రేటు 40 శాతానికి పెరిగిందని కేంద్రం పేర్కొంది. 

 

మూడు శాతం లోపే మరణాలు ఉన్నాయి. 39 వేలకుపైగా బాధితులు కోలుకున్నారు. క‌రోనా కేసుల సంఖ్య 1,01,139. ఇప్పటివరకు 40 శాతం మంది రోగులు కరోనాతో విజయం సాధించారు. ఇప్పటివరకు 3 వేల 163 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా కేసులు మాత్రం ఊహించని వేగంతో పెరగడమే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: