ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రంగనాయకి అనే వృద్దురాలిపై కేసు పెట్టడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేసారు. అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు జగన్, ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదన్నారు.
ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్ అని ఆరోపించారు. గ్రామస్తులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ గారిపై కేసు పెడతారా? అని నిలదీశారు. 66 ఏళ్ల వృద్ధురాలుపై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే. 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలి? అని ఆరోపించారు.
అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి,వెంటాడి వేధిస్తున్నారు @ysjagan. ప్రమాదకరమైన స్టెరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు. (1/3) pic.twitter.com/icVou1rsoy
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 19, 2020ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్. గ్రామస్తులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ గారి పై కేసు పెడతారా? (2/3)
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 19, 202066 ఏళ్ల వృద్ధురాలు పై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం.మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే. 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యాలి? (3/3)#SupportRangaNayakiMadam
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 19, 2020