కరోనా ఆర్ధిక కష్టాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ విధించడం ఇప్పుడు చాలా మందిని ఆర్ధికంగా దెబ్బ కొట్టింది అనే చెప్పవచ్చు. దీని వలన చాలా మంది ఇప్పుడు తీవ్రంగా నష్టపోవడమే కాదు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి అనేది ఏర్పడింది అనే సంగతి తెలిసిందే. కరోనా కట్టడి అయ్యే అవకాశాలు కూడా కనపడటం లేదు. 

 

దీనితో ఇప్పుడు ఆర్ధిక కష్టాలు తట్టుకోలేని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఆర్ధిక కష్టాలతో కరీమా అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణం జీర్ణించుకోలేని కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తో కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: