ఉగ్రవాదుల వేటలో కాశ్మీర్ లో సైన్యం ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తుంది. కరోనా ఉన్నా సరే సైన్యం మాత్రం ఎక్కడా ఆగడం లేదు. నిఘా వర్గాల సహకారం తో ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను కట్టడి చేస్తున్నాయి మన బలగాలు. తాజాగా శ్రీనగర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో 10 గంటల పాటు సాగింది ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్. నవకదల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న బలగాలు... 

 

స్థానిక పోలీసుల సహకారంతో ఆపరేషన్ చేపట్టాయి. నిన్న రాత్రి నుంచి అక్కడ ఆపరేషన్ సాగుతూనే ఉంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్ ఆల్ ఔట్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏకంగా 80 మంది ఉగ్రవాదులను మన బలగాలు కాల్చి చంపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: