ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత పెరుగుతున్నా సరే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. టీడీపీ నేతలు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో స్పందించిన చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ కి భూమి ఇచ్చిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేసారు. 

 

ఎల్జీ పాలిమర్స్ మీద ప్రభుత్వం చర్చకు సిద్దమా అని చంద్రబాబు సవాల్ చేసారు. 2019 జులై 9న మీరు కేంద్రానికి సిఫారసు చేయలేదా అని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ కు ఒక్క అనుమతి కూడా వైసీపీ ఇవ్వలేదు అనడం అబద్దం అని చంద్రబాబు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: